అహ్మదాబాద్‌కు ‘బోయింగ్‌’ నిపుణులు.. ప్రమాదంపై విశ్లేషణ | Boeing Experts in Ahmedabad to Analyse Details | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్‌కు ‘బోయింగ్‌’ నిపుణులు.. ప్రమాదంపై విశ్లేషణ

Jun 16 2025 12:49 PM | Updated on Jun 16 2025 1:34 PM

Boeing Experts in Ahmedabad to Analyse Details

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై అన్నివైపుల నుంచి దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ప్రమాదంపై విశ్లేషించేందుకు ‘బోయింగ్’ నిపుణులు సోమవారం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. 242 మందితో  సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని ఒక వైద్య కళాశాలపై కూలిపోయింది.

ఈ ప్రమాదంలో 11 ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు మినహా మిగిలిన అందరూ మృతిచెందారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ను 2023 జూన్‌లో సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ  ఏడాది డిసెంబర్‌లో  తిరిగి సమగ్ర తనిఖీలు చేయాల్సివుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ దొరికిందని ధృవీకరించారు. ఇది ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడంలో వారికి సహాయపడనుంది.
 

ఆదివారం బీజే  ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రాకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. విమానంలో కీలకమైన డేటాను రికార్డ్ చేసే పరికరం హాస్టల్ పైకప్పుపై  లభ్యమయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించింది. యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అంతర్జాతీయ ప్రోటోకాల్‌ల  కింద సమాంతర దర్యాప్తును నిర్వహిస్తోంది.



ఇది కూడా చదవండి: 2027 మార్చి ఒకటి నుంచి జనగణన.. ప్రక్రియ ఇదే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement