
ఢిల్లీ: శ్రీనగర్ విమానాశ్రయంలో దారుణ ఘటన జరిగింది. ఓ ఆర్మీ అధికారి స్పైస్ జెట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పరిమితికి మించి అదనపు లగేజీని విమానంలోకి తీసుకెళ్లేందుకు ఆ ఆర్మీ అధికారి ప్రయత్నించగా.. స్పైస్ జెట్ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ ఆర్మీ అధికారి దురుసుగా ప్రవర్తించడంతో పాటు నలుగురు స్పైస్ జెట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. గత నెల జులై 26న జరగ్గా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్ జెట్ విమానంంలో ప్రయాణించేందుకు ఆ అధికారి 7 కిలోల పరిమితిని మించి 16 కిలోల లగేజీ తీసుకువచ్చారు. అదనపు ఛార్జ్ చెల్లించాల్సిందిగా స్పైస్ జెట్ సిబ్బంది కోరారు. దీంతో ఆ ఆర్మీ అధికారి నిరాకరించాడు. భద్రతా ప్రోటోకాల్ను ఉల్లంఘించడంతో పాటు.. బోర్డింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండా ఏరో బ్రిడ్జిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ఆర్మీ అధికారిని గేట్ వద్దకు పంపించారు.
మరో వైపు, గేట్ వద్దకు చేరుకున్న ఆర్మీ అధికారి.. అక్కడున్న క్యూ స్టాండ్తో స్పైస్ జెట్ గ్రౌండ్ సిబ్బందిపై దాడి చేశాడు. ఒక ఉద్యోగి కిందపడి స్పృహ కోల్పోయినప్పటికీ కొట్టడం ఆపలేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు స్పైస్ జెట్ సిబ్బందిపైనా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడగా.. ఒకరికి వెన్నెముక విరిగినట్లు స్పైస్ జెట్ పేర్కొంది.
SHOCKING “MURDEROUS” Assault on SpiceJet Staffers at Srinagar Airport
Passenger attacks 4 SpiceJet Staffers with whatever he cud get hold off— 2 grievously injured. Jaw & Spine injured.
July 26th incident, FIR Filed
Pax - allegedly an army officer - put on NO FLY List 1/2 pic.twitter.com/g79eiuSy3P— Amit Bhardwaj (@tweets_amit) August 3, 2025
ఈ సంఘటనపై పోలీసులకు స్పైస్ జెట్ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఆర్మీ అధికారిపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనపై ఆర్మీ కూడా స్పందించింది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని వెల్లడించింది.