
జిల్లా స్థాయి అవార్డుల ప్రదానం
నారాయణపేట: నీతి ఆయోగ్ ఆకాంక్ష బ్లాక్ కార్యక్రమం కింద శుక్రవారం జిల్లా, నర్వ మండల అధికారులు, సంపూర్ణ అభియాన్ సమ్మన్ సమరోహ్ కింద నర్వలోని ఫ్రంట్లైన్ కార్మికులకు సౌకర్యాలు కల్పించడానికి జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్స్లో జిల్లా స్థాయి అవార్డులను కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రదానం చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించి సంపూర్ణ అభియాన్– ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి రంగాల నుంచి సూచికల సంతృప్తం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్ మాట్లాడుతూ అధికారులు నిజాయితీగా పని చేయాలని, కేపీఐ సూచికలను సంతృప్తి పరచాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ, నోడల్ అధికారి మొగులప్ప, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, డాక్టర్ శైలజ, నర్వ ఎంపీడీఓ శ్రీనివాస్, సీడీపీఓ, మెప్మా అధికారులు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.