
అమాయకులకు వల
గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ
●
పోలీసులకు ఫిర్యాదు
చేయండి..
ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి.
– రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్కర్నూల్
సాక్షి, నాగర్కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’
అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
పెరుగుతున్న దందాలు
అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు

అమాయకులకు వల