
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నూతన రీజియన్ కమిటీ అధ్యక్షుడు భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి సత్యశీలారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ రహెమాన్ సోఫి, రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సత్యన్న ఆచారి, రాష్ట్ర కార్యదర్శి బసన్న ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ రీజియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రీజియన్ అధ్యక్షుడిగా భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శిగా సత్యశీలారెడ్డి, కోశాధికారిగా కేకే మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాంమూర్తి, ఉపాధ్యక్షుడిగా గోపాల్రెడ్డి, చీఫ్ అడ్వయిజర్గా ఎంకే జోసెఫ్, జాయింట్ సెక్రటరీగా దమ్మాయిపల్లి శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని పది డిపోలకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.