ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్లపైనే తిరిగి పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. ఎమ్మెల్యే విరూపాక్షిని ట్రాప్ చేసి రప్పించడం కోసమే ముందస్తు ప్రకారం కార్యకర్తపై దాడికి తెగబడ్డారు. రాత్రి పిలిస్తే వచ్చే ఎమ్మెల్యేను అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి హర్డ్ డిస్క్లు, కెమెరాలు లాక్కెళ్లడం ఏ చట్టం కిందకు వస్తుందో పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వైఎస్సార్సీపీ నేతలు అన్యాయం జరిగిందని పోలీసుస్టేషన్కు వెళితే వాళ్లపైనే కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం నడుస్తోంది. విరూపాక్షిపైన పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే విరమించుకోవాలి. మేం న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ చట్టబద్ధంగా పోరాడుతాం. – శైలజనాథ్, మాజీ మంత్రి


