
డోన్లో టీడీపీ నాయకుల భూ కబ్జాలు
నేడు
● రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు
అన్యాక్రాంతం
● చోద్యం చూస్తున్న మైనర్ ఇరిగేషన్,
రెవెన్యూ, మున్సిపల్ అధికారులు
డోన్: అధికారంలో ఉన్నామని టీడీపీ నాయకులు బరితెగించారు. ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. గతంలో తొలగించిన అక్రమ నిర్మాణాలు పునఃప్రారంభించారు. టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విముక్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాలను తిరిగి ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు. మైనర్ ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల వ్యయం చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డోన్ పట్టణంలో గరిష్టంగా సెంటు రూ.15లక్షలకుపైగా ధర పలుకుతోంది.
కబ్జాలు ఇలా..
● డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా స్కిల్ డెవలప్మెంట్ పక్కన సర్వే నంబర్ 327లో 50 సెంట్ల వంక పోరంబోకు స్థలం ఉంది. ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేశారు. అంతేకాకుండా ఉడుములపాడు చెరువుకు వర్షపు నీరు చేరకుండా అడ్డుగోడ కట్టారు. అప్పట్లో ఉడుములపాడు రైతులు కదిలివచ్చి అడ్డు గోడను పెకలించి వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఽపెకలించిన గోడను తిరిగి పునర్నిర్మించారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
● టీడీపీ నాయకునికి చెందిన ఎంకే టౌన్షిప్ పక్కన సాక్షి నివాస్ వారితో కలిసి 60 అడుగుల రోడ్డు కోసం స్థలాన్ని వదిలారు. ప్లాట్లన్నీ విక్రయించిన తర్వాత మధ్యలో గోడ కట్టి 30 అడుగుల రోడ్డును చూపించారు. తాము తమ హద్దు వరకు గోడ కట్టినట్లు టీడీపీ నాయకుడు వాదిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు 60 అడుగుల రోడ్డు మధ్యలో ఉన్న గోడను కూల్చివేశారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే గోడను సదరు టిడిపి నాయకుడు తిరిగి పునర్నిర్మించాడు.
నాడు
ఇవీ ఆరోపణలు..
డోన్ పట్టణంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అధికారులు ప్రోత్సహిస్తున్నారని సర్వసభ్య సమావేశంలో టీడీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ ఆరోపించారు. అధికారుల అవినీతిపై ఒక తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు రూపంలో పంపాలని సర్వసభ్య సమావేశం నిర్ణయించారు.

డోన్లో టీడీపీ నాయకుల భూ కబ్జాలు

డోన్లో టీడీపీ నాయకుల భూ కబ్జాలు

డోన్లో టీడీపీ నాయకుల భూ కబ్జాలు