దినచర్యలో యోగా భాగం కావాలి | - | Sakshi
Sakshi News home page

దినచర్యలో యోగా భాగం కావాలి

Jun 22 2025 4:10 AM | Updated on Jun 22 2025 4:10 AM

దినచర

దినచర్యలో యోగా భాగం కావాలి

నంద్యాల(అర్బన్‌): దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ను చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విశాఖపట్నంలో పీఎం మోదీ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్సీ ఇషాక్‌ బాషా, జిల్లా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధు లు, ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ మున్సిపల్‌, మెడికల్‌, ఆయుష్‌ శాఖలు గత నెల రోజుల నుంచి యోగ విన్యాసాలలో అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు నిర్వహించే పనులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్‌ చేశారన్నారు. యోగా కార్యక్రమంపై జిల్లాస్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించామన్నారు. మన జిల్లాలో తయారు చేసిన వీడియోకు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి వచ్చిందని కలెక్టర్‌ తెలిపారు. అలాగే బనగానపల్లె బృందం తయారు చేసిన స్క్రిప్టుకు రాష్ట్ర స్థాయిలో మూడవ బహుమతి వచ్చిందన్నారు. అనంతరం యోగా గురువులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, ఆయుష్‌ శాఖ సీనియర్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ యశోధర, ఆర్డీఓ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

కోర్టు ఆవరణంలో యోగా దినోత్సవం

నంద్యాల(వ్యవసాయం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు హాల్‌లో జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాస నాలు వేశారు. ఈ సందర్భంగా మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, రెండవ అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి తంగమణి, ఫస్ట్‌క్లాస్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మికర్రి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది యోగా చేసి పని ఒత్తిడిని దూరం చేసుకోవయచ్చన్నారు. అదే విధంగా ఆరోగ్యంగా, దీర్ఘకాలిక జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హుసేన్‌బాషా, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, ముక్కెర కృష్ణారెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా యోగా వీడియోకు రాష్ట్ర స్థాయిలో ప్రథమం

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

దినచర్యలో యోగా భాగం కావాలి1
1/1

దినచర్యలో యోగా భాగం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement