
మెప్మా సీఆర్పీ రిమాండ్కు తరలింపు
బొమ్మలసత్రం: పొదుపు మహిళల రుణాలను కాజేసి మోసం చేసిన మెప్మా సీఆర్పీ షేక్ వహీదాను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతానికి చెందిన షేక్ వహీదా మెప్మా సీఆర్పీగా పని చేస్తున్నారు. ఆమె పరిధిలోని 30 పొదుపు గ్రూపులు ఉన్నాయి. కాగా ఆయా పొదుపు గ్రూపులకు మంజూరు చేసిన రుణాలను సగం తీసుకుని మిగిలిన సగం మాత్రమే పొదుపు సభ్యులకు ఇవ్వడం.. అలాగే వారు చెల్లించిన రుణ కంతులను బ్యాంకులో జమ చేయకుండా కాజేశారు. అయితే తీసుకున్న రుణాలు చెల్లించలేదని బ్యాంకు అధికారులు పొదుపు మహిళలకు నోటీసులు పంపడంతో సీఆర్పీ వహీదా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మోసపోయామని గ్రహించిన పొదుపు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఆర్పీ వహీదాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను రిమాండ్కు తరలించామన్నారు.
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు ...
● ఆటో బోల్తా పడి వృద్ధురాలి దుర్మరణం
గోస్పాడు/మహానంది: ఎస్.నాగులవరం–పసురపాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం దైవదర్శనం నిమిత్తం రంగాపురం సమీపంలోని మద్దిలేటిస్వామి దర్శనానికి ఆటోలో వెళ్లారు. పూజలు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ఎస్.నాగులవరం సమీపంలో ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆవుల లక్ష్మీదేవి(65) అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశ్వర్లు, మౌనిక, చిన్న సరవయ్య, లక్ష్మిపతి, ఆవుల నరసమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆవుల నరసమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతురాలు లక్ష్మీదేవి భర్త గత కొద్దినెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బంధువులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
పాణ్యం: పిన్నాపురం గ్రామ రస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. శనివారం సాయంత్రం గొర్రెల కాపరులు గడ్డిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా వ్యక్తి మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, కాళ్లకు బెల్ట్ చెప్పులు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాధ్యతల స్వీకరణ
గోస్పాడు: జిల్లా ఔషధ నియంత్రణ అధికారిగా హనుమన్న శనివారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన దాదా ఖలందర్ చిత్తూరు జిల్లా మదనపల్లెకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురంలో పని చేస్తున్న హనుమన్నను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విధుల్లో చేరారు. నంద్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలతో పాటు కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. డోన్, డివిజన్కు డ్రగ్ ఇన్స్పెక్టర్గా కర్నూలు రూరల్ విభాగానికి జయరాంను నియమించారు.
నల్లమలలో ట్రాఫిక్ జాం
ఆత్మకూరురూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. ఆత్మకూరు – దోర్నాల ప్రధాన రహదారిలోని నంద్యాల – ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో శనివారం భారీ వృక్షం నేల కూలడంతో రెండు గంటల సేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. పెద్ద పెంట రాస్తా ఏటిపాయ గేటు వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో దాదాపు 2 గంటల వరకు అడవిలో ప్రయాణికులు అల్లాడి పోయారు. అటవీ శాఖకు చెందిన ప్రొటక్షన్ వాచర్లు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు యథాతధంగా కొనసాగాయి.
సచివాలయ ఉద్యోగుల సమాచారాన్ని పంపండి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేది నాటికి పక్కాగా పంపించాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. శనివారం సా యంత్రం ఆయన తన చాంబర్ నుంచి జిల్లా లోని ఎంపీడీఓలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. అర్బ న్ ప్రాంతాల్లోని సచివాలయాలకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలను, ఇతరత్రా వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

మెప్మా సీఆర్పీ రిమాండ్కు తరలింపు

మెప్మా సీఆర్పీ రిమాండ్కు తరలింపు