
శ్రీశైలానికి పెరుగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలంలోని నీలంసంజీవరెడ్డి ప్రాజెక్ట్కు వరద తాకిడి పెరిగింది. జూరాలలో స్పిల్వే ద్వారా, విద్యుత్ ఉత్పాదన అనంతరం, సుంకేసుల బ్యారేజి నుంచి, సెల్ఫ్ క్చామెంట్ ఏరియాలో కురిసిన 40.60 మిల్లీమీటర్ల వర్షంతో శుక్రవారం నుంచి శనివారం వరకు డ్యాంలోకి 79,212 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గత మూడు రోజులుగా శ్రీశైలం డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదలను నిలిపివేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 86.4762 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 852.90 అడుగులకు చేరుకుంది.