విషాదం | - | Sakshi
Sakshi News home page

విషాదం

Apr 23 2025 8:13 AM | Updated on Apr 23 2025 8:49 AM

విషాద

విషాదం

● రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి

ఆలూరు/ఆస్పరి: పేదింట్లో విషాదం నెలకొంది. పేదరికం నుంచి బయట పడేందుకు నలుగురు పిల్లలను చదివిస్తున్న ఆ కుటుంబంపై విధి పగపట్టింది. లారీ రూపంలో తండ్రి వడ్డె ఈరన్న(45)ను, అతని రెండో కుమార్తె వడ్డె శ్రావణి (14)ని కబళించింది. ఈ దుర్ఘటన పెద్దహోతూరు సమీపంలో నిర్మాణంలో నిలిచిన టోల్‌గేట్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఈరన్న, రాధమ్మ దంతులకు సెంటు భూమి లేదు. ఈరన్న టైలర్‌గా, రాధమ్మ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. వీరి పెద్ద కుమార్తె హిందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుని తండ్రి దగ్గర టైలరింగ్‌ పని నేర్చుకుంటోంది. రెండో కుమార్తె శ్రావణి (14) చిప్పగిరిలో కస్తూర్బా పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడో కుమార్తె స్వాతి 6 తరగతి మండలంలోని బిల్లేకల్లు హైస్కూల్లో, చిన్న కుమారుడు విక్రమ్‌ 3వ తరగతి ముత్తుకూరులోనే చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యా శాఖ అధికారులు సెలవులు ప్రకటించడంతో రెండో కుమార్తె వడ్డె శ్రావణి ని తీసుకొచ్చేందుకు తండ్రి వడ్డె ఈరన్న మోటార్‌ సైకిల్‌పై చిప్పగిరి వెళ్లాడు. పాఠశాల నుంచి రెండో కుమార్తె శ్రావణితో పాటు సొంతూరుకు వస్తుండగా కర్నూలు నుంచి ఆలూరు వైపు వస్తున్న లారీ పెద్దహోతూరు సమీపంలో బలంగా ఢీ కొట్టింది. దీంతో తండ్రి, కుమార్తె ఇద్దర ఒక్కసారిగా టైర్లు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆలూరు ఎస్‌ఐ మహబూబ్‌బాషా ,హెడ్‌ కానిస్టేబుల్‌ జానీవాకర్‌, పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

విషాదం 1
1/1

విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement