మ్యాన్హోల్ నిర్మాణం అస్తవ్యస్తం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలోని కాలనీలు డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్ల వెంట వేసిన డ్రెయినేజీ పైపులు.. ఇళ్ల నుంచి వచ్చే మురుగు పైపుల కంటే మ్యాన్హోల్స్ ఎత్తులో నిర్మించారు. దీంతో మురుగునీరు వాటిలోకి పోలేని పరిస్థితి. మూడున్నరేళ్ల క్రితం హిల్కాలనీ, పైలాన్ కాలనీలో 70శాతం సీసీ రోడ్లు వేయడంతో చాలా వరకు డ్రెయినేజీలు పూడిపోయినా వాటిని పునరుద్ధరించలేదు. సాగర్ డ్యాం కాలనీలు ఎత్తులో ఉండడంతో డ్రెయినేజీల నిర్మాణం సాధ్యపడడం లేదు. దీంతో ఆయా కాలనీల్లోని వీధుల్లో మురుగు ప్రవహిస్తోంది.


