స్వర్ణగిరి క్షేత్రంలో కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

స్వర్ణగిరి క్షేత్రంలో కుంకుమార్చన

Jun 21 2025 3:41 AM | Updated on Jun 21 2025 3:41 AM

స్వర్

స్వర్ణగిరి క్షేత్రంలో కుంకుమార్చన

భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం అష్టోత్తర శత నామాలతో విశేష కుంకుమార్చన సేవ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ఉదయం స్వామి వారికి సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామర్చన, సేవ, నిత్య కల్యాణమహోత్సవం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహారతులు సమర్పించారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

అనుమతి లేకుండా

విక్రయిస్తున్న వరి విత్తనాలు సీజ్‌

గరిడేపల్లి: మండల పరిధిలోని చవ్వారిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలను అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. మిర్యాలగూడ శివారులోని తుమ్మడం గ్రామానికి చెందిన కొంత మంది చవ్వారిగూడెం గ్రామం నుంచి అనుమతులు లేని విత్తన బస్తాలను ఆటోలో తీసుకెళ్తుండగా నేరేడుచర్ల పట్టణ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీయగా అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈమేరకు గరిడేపల్లి మండలం వ్యవసాయ అధికారి ప్రీతమ్‌కుమార్‌, హుజూర్‌నగర్‌ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో చెవ్వారిగూడెం గ్రామానికి వెళ్లి తిప్పన రాంరెడ్డికి చెందిన గోదాంలో తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఉన్న 150బస్తాల వరి విత్తనాలను సీజ్‌ చేశారు. కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌, గరిడేపల్లి ఏఎస్‌ఐ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణగిరి క్షేత్రంలో కుంకుమార్చన1
1/1

స్వర్ణగిరి క్షేత్రంలో కుంకుమార్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement