
22న ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షుడు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1–1–2009 నుంచి 31–12–2011 మధ్య జన్మించిన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో రిపోర్టు చేయాలని తెలిపారు. క్రీడాకారులు వారి ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఫుట్బాల్ కిట్ తో హాజరు కావాలని కోరారు. నల్లగొండలో ఎంపికై న జిల్లా జట్టు ఈనెల 28 నుంచి జూలై1వ తేదీ వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు.
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం విశేషపూజలు కొనసాగాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ సేవను కృష్ణానది వద్ద ప్రహ్లాద ఘాట్కు తరలించి హారతి పూజలు నిర్వహించారు.