
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం
బీబీనగర్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని జైనపల్లి గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా రఘునాఽథ్పల్లి మండలం మండేలగూడెం గ్రామానికి చెందిన డ్యగాల కిరణ్(26) హైదరాబాద్లోని ఆమెజాన్ ఆన్లైన్ కొరియర్లో ఉద్యోగం చేస్తున్నాడు. కిరణ్ 3సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఖర్చులు బాగా పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో అమ్మాయి అతడి నుంచి దూరమైంది. దీంతో కిరణ్ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున బీబీనగర్ సమీపంలోని జైనపల్లి గ్రామపరిధిలోకి చేరుకొని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులు గమనించి పోలీస్లకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భార్య సంపాదనపై
ఆధారపడుతున్నానని మనస్తాపం
ఫఉరేసుకుని ఆత్మహత్య
సంస్థాన్ నారాయణపురం: చేసిన అప్పులు తీర్చలేకపోవడంతోపాటు, భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని మనస్తాపనకు గురైన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సర్వేల్ గ్రామంలో చేసుకుంది. ఎస్ఐ జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ సిద్దిక్(26) అఫీజాబేగంలు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సిద్దిక్ కారు కొనుగోలు చేసి నడిపించేవాడు. తిరిగి దానిని అమ్మివేసి, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సంవత్సరం క్రితం అఫిజాబేగంకు సర్వే ల్ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఉద్యోగం రావడంతో వీరు సర్వేల్కు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అప్పులు ఎక్కువ కావడంతోపాటు, భార్య సంపాదనపై ఆధారపడుతున్నానని సిద్దిక్ మనస్తాపానికి గురయ్యా డు. భార్య శుక్రవారం పాఠశాలకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సిద్దిక్ ఉరివేసుకున్నాడు. ఆమె పాఠశాల నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా వేలాతున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్
భువనగిరి : బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన సెల్ ఫోన్ను అప్పగించి ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణానికి చెందిన యానూష్ శుక్రవారం నల్లగొండకు వెళ్లేందుకు భువనగిరి బస్టాండ్కు వచ్చి నల్లగొండ డిపోకు చెందిన సెమీ డీలక్స్ బస్సు ఎక్కాడు. యానూష్ తన సెల్ ఫోన్ను బస్సులో మర్చిపోయి నల్లగొండ బస్టాండ్లో దిగి వెళ్లిపోయాడు. బస్సులో సెల్ఫోన్ను గుర్తించిన కండక్టర్ సీఎస్ రెడ్డి భువనగిరి బస్టాండ్కు వచ్చిన తరువాత విషయాన్ని స్థానిక కంట్రోల్కు వివరించారు. ఫోన్ మరిచి వెళ్లిపోయిన బంధువుకు సామాజిక కార్యకర్త కడారి వెంకటేశం సమక్షంలో ఫోన్ను అప్పగించారు. బస్సులో మరిచిపోయిన సెల్ఫోన్ను అప్పగించిన కండక్టర్ను పలువురు అభినందించారు.