
ఆదర్శం.. ఆ ఉపాధ్యాయులు
ఫ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలలపై
నమ్మకం కలిగించేలా..
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని మక్తా కొత్తగూడెం గ్రామానికి చెందిన మట్టపల్లి సైదులు ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన తన కుమారులైన గణ సాత్విక్, మంజిత్లను తాను పనిచేస్తున్న పాఠశాలలోనే శుక్రవారం చేర్పించారు. అనంతరం వారికి ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకే తన ఇద్దరి కుమారులను ఈ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.
అడ్డగూడూరు: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను తాము చదువు చెబుతున్న పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నరేష్కు కుమార్తె రిషక, కుమారుడు రిషిదేవ్ ఉన్నారు. శుక్రవారం కుమార్తె రిషికను అదే పాఠశాలలోని 3వ తరగతిలో, కుమారుడు రిష్దేవ్ 2తరగతిలో చేర్చించారు. గతంలో వీరు తిరుమలగిరి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో చదివేవారని, విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.

ఆదర్శం.. ఆ ఉపాధ్యాయులు