
నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
నల్లగొండ : పట్టణంలోని రామగిరిలో గల గీతాంజలి అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి సురేష్(44) నల్లగొండ పట్టణం రామగిరిలోని గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ ఫొటో లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తూ.. సమీపంలోనే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి సురేష్పై కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సురేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
● హతుడు నకిరేకల్కు చెందిన గద్దపాటి సురేష్గా గుర్తింపు

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య