తల్లి మందలించడంతో ఇంటర్‌ యువతి తీవ్ర విషాదం.. | - | Sakshi
Sakshi News home page

తల్లి మందలించడంతో ఇంటర్‌ యువతి తీవ్ర విషాదం..

Jan 14 2024 2:30 AM | Updated on Jan 16 2024 10:48 AM

- - Sakshi

పూజిత (ఫైల్‌)

నల్గొండ: తల్లి మందలించిందనే కారణంతో గడ్డిమందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన చింతల యాదయ్య, సైదమ్మల నాలుగో కుమార్తె పూజిత(17) సూర్యాపేటలోని సాయిగౌతమి జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వడంతో పూజిత శుక్రవారం మధ్యాహ్నం కళాశాల నుంచి ఇంటికి వచ్చింది.

చదువు విషయమై తల్లి సైదమ్మ కూతురు పూజితను మందలించింది. ఈ కారణంతో పూజిత వెంటనే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న గడ్డి మందు సేవించింది. చుట్టుపక్కల వారు చూసి సూర్యాపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్‌ఐ బి.అంజిరెడ్డి తెలిపారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement