
రైతుకు ‘భరోసా’
రైతుల ఖాతాల్లో నిధుల జమ
●
జాబితా సిద్ధం చేశాం..
జిల్లాలో రైతు భరోసాకు సంబంధించి అర్హుల జాబితా రాష్ట్ర ప్రభుత్వంతో సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేయడం జరిగింది. సోమవారం సాయంత్రం నుంచే కొంత మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయ్యాయి.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి
డబ్బులు జమయ్యాయి..
ప్రస్తుత వానాకాలం సీజన్లో వ్యవసాయ పెట్టుబడి పెట్టే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు జమచేయడం సంతోషంగా ఉంది. ఈ పథకం ద్వారా నాకున్న ఎకరా పొలానికి గాను రూ.6 వేలు బ్యాంకు ఖాతాలో సోమవారం రాత్రి జమయ్యాయి.
– చంద్రశేఖర్,
రైతు, జూపల్లి, చారకొండ మండలం
ఆసరా అవుతాయి..
నాకు ఎకరా 18 గుంటల వ్యవసాయ పొలం ఉంది. ఆ పొలంలో వరి పంట సాగు చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. నా బ్యాంకు ఖాతాలో రూ.8,700 జమైనట్లు మెసేజ్ వచ్చింది. ఈ నిధులు నాకు ఎంతో ఆసరా అవుతాయి. రైతు భరోసా నిధులు రావడం సంతోషంగా ఉంది.
– ఖాజామైనొద్దీన్, రైతు,
మార్చాల, కల్వకుర్తి మండలం
నాగర్కర్నూల్: వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాగు ఖర్చుల నిమిత్తం అందించే రైతు భరోసా నిధుల కోసం జిల్లాలో రైతుల జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి సోమవారం లాంఛనంగా నిధులు విడుదల చేయడంతో మంగళవారం నుంచి రైతు ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం పనులు కొనసాగుతున్న ఈ సమయంలో రైతులకు భరోసా నిధులు జమ కానుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తొమ్మిది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ వానాకాలానికి పూర్తిస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా నిధులు అందుతాయని రైతులు భావిస్తున్నారు.
ఏడాదికి రూ.12 వేలు..
జిల్లాలో రైతులు, నిధుల జమ ఇలా..
సంవత్సరం సీజన్ రైతులు నిధులు
(రూ.కోట్లలో)
2018 యాసంగి 2.19 262.97
2018 వానాకాలం 2.38 274.08
2019 యాసంగి 1.90 225.80
2019 వానాకాలం 2.27 299.70
2020 యాసంగి 2.58 362.71
2020 వానాకాలం 2.51 356.71
2021 యాసంగి 2.77 366.45
2021 వానాకాలం 2.66 363.62
2022 యాసంగి 2.83 361.33
2022 వానాకాలం 2.88 368.52
2023 యాసంగి 3.06 369.21
2023 వానాకాలం 3.01 370.17
2024 యాసంగి 2.47 247.39
రైతులకు సాగు ఖర్చులకు నిధులు అందించాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదటి సారిగా 2018 సంవత్సరం యాసంగిలో రైతు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసింది. ప్రతి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.8 జమ చేసింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలకు పెంచింది. ఆ తర్వాత 2023లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలకు పెంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 3,34,835 మంది రైతులతో అర్హుల జాబితా సిద్ధం చేయగా.. వీరికి రూ.429.31 కోట్ల నిధులు జమ చేయాల్సి ఉంది. అయితే 2024 యాసంగిలో చాలామంది రైతులు రైతుభరోసా జమ చేయడంలో గంగరగోళం నెలకొంది. ఈ సీజన్లో కూడా ఎన్ని ఎకరాల వరకు నిధులు జమ చేస్తారో అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
తొలిరోజు జమ అయిన నిధులు ఇలా..
రైతులు 1,63,796
నిధులు రూ.1,00,90,97,923
తొమ్మిది రోజుల్లో ప్రక్రియ
పూర్తిచేస్తామని వెల్లడి
గడిచిన 13 సీజన్లలో కలిపి రూ.4,228.66 కోట్లు మంజూరు
ఈ వానాకాలంలో 3.34 లక్షల
మందికి రూ.429 కోట్లు కేటాయింపు
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

రైతుకు ‘భరోసా’

రైతుకు ‘భరోసా’