డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

Jun 21 2025 3:03 AM | Updated on Jun 21 2025 3:03 AM

డ్రగ్

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

ములుగు రూరల్‌: జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) మహేందర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు, కళాశాలల్లో పోస్టర్లు అంటించాలన్నారు. గంజాయి, పొగాకు, మద్యం వాటి వినియోగంతో యువత ఎలా బలైపోతున్నారో వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విధులకు గైర్హాజరైతే చర్యలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని కొడిశాల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో స్టాఫ్‌ నర్సు ఒక్కరే విధులకు హాజరు కాగా మిగతా వైద్యాధికారితో పాటు సిబ్బంది అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు తెలిపారు. వర్షాకాలం సీజన్‌లో వ్యాధుల నిర్మూలనకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. మారుమూల గిరిజన గ్రామంలోని కొడిశాల పీహెచ్‌సీలో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డీపీఎం సంజీవరావు ఉన్నారు.

మావోయిస్టుల

బంద్‌ పాక్షికం

వాజేడు/వెంకటాపురం(కె): మావోయిస్టులు బంద్‌ శుక్రవారం వాజేడు, వెంకటాపురం (కె) మండలాల్లో పాక్షికంగా జరిగింది. వాజేడు మండలంలో బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆటోలు, వాహనాలు యథావిధిగా తిరిగాయి. కొన్ని దుకాణాలను మాత్రమే మూసి ఉంచగా ఎక్కువ దుకాణాలు తెరిచారు. ప్రజలు రోజువారీగా ఎవరి పనులను వారు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొనసాగాయి. వెంకటాపురం (కె) మండలంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్ని షాపులు తెరచుకున్నాయి.

108, 102 వాహనాల తనిఖీ

వెంకటాపురం(కె): మండలకేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా పోగ్రాం మేనేజర్‌ నధీర్‌, వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ రాజ్‌కుమార్‌లు 102, 108 వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 108, 102 వాహనాలకు సంబంధించిన రికార్డులను, యంత్రాల పని విధానాన్ని పరిశీలించారు. భవిషత్‌లో ప్రజలకు ఏవిధంగా సేవలు అందించాలని సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రాజ్యలక్ష్మి, పైలట్‌ కుమార్‌, రాధస్వామి, 102 కెప్టెన్‌ వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

23న ఒలింపిక్‌ డే రన్‌

భూపాలపల్లి అర్బన్‌: అంతర్జాతీయ ఒలింపిక్‌ డేను పురస్కరించుకొని ఈ నెల 23న రన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీహెచ్‌.రఘు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డ్రగ్స్‌ రహిత జిల్లాగా  మార్చేందుకు కృషి
1
1/2

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

డ్రగ్స్‌ రహిత జిల్లాగా  మార్చేందుకు కృషి
2
2/2

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement