
ఆదివాసీలకు చట్టబద్ధత కల్పించాలి
ములుగు రూరల్: షెడ్యూల్ ప్రాంతంలో పూర్వం నుంచి జీవిస్తున్న ఆదివాసీలకు చట్టబద్ధత కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చింత కృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దివాకరకు తుడుందెబ్బ, ఎమ్మార్పీఎస్ నేతలు కలిసి వినతి ప్రతం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా భూభాగం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ భాగాన్ని కాపాడాల్సిన దేశ అత్యున్నత ఇండియన్ సర్వీసెస్ అధికారులే చోద్యం చేయడం బాధాకరమన్నారు. ఏటూరునాగారంలోని శివపురం షెడ్యూల్డ్ ఏరియా గ్రామంలో కొంతమంది గిజనేతరులు ఆదివాసీల పట్టా భూమిని సాగు చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నెమలి నర్సయ్య, నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యుడు బొల్లెం సారయ్య, ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు వావిలాల స్వామి పాల్గొన్నారు.