
వాతావరణం
జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రత ఉంటుంది. సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
● కలెక్టర్ దివాకర
ములుగు రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర శుక్రవారం కోరారు. నేడు (శనివారం) గిరిజన భవన్లో అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహిస్తున్నారని, ఈ వేడుకలకు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం, ఆయుష్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా జిల్లా కేంద్రంలో యోగా దినోత్సవ వేడుకలను ఉదయం 7 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ఆర్గనైజర్లు, జిల్లా పోగ్రాం మేనేజర్ (ఆయుష్) డాక్టర్ ఎన్ లీ చంద్ర, జిల్లా ఇన్చార్జ్ సంధ్య, యోగా ఇన్స్ట్రక్టర్ శివకృష్ణ, మానస, హరిత పాల్గొననున్నట్లు తెలిపారు.
సన్నబియ్యం పంపిణీ
వందశాతం పూర్తి
ములుగు రూరల్: జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న మూడు నెలల సన్నబియ్యం పంపిణీ వందశాతం పూర్తి అయిందని జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ శుక్రవారం తెలిపారు. రేషన్కార్డుదారులకు జూన్, జూలై, ఆగస్టు నెల బియ్యాన్ని జిలాల్లో 222 రేషన్ షాపుల ద్వారా 5,218 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీలో జిల్లాలో అన్ని శాఖల అధికారుల సహకారంతో 19 రోజుల్లోనే పూర్తి చేశామన్నారు.
రూ.75.13కోట్లు జమ
ములుగు రూరల్: ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేసిందని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ శుక్రవా రం తెలిపారు. జిల్లాలో 73,129 మంది రైతులకు గాను రూ.75.13 కోట్లు జమ చేశామన్నారు. రైతుభరోసా డబ్బులను వ్యవసాయ అవసరాలకు వాడుకోవాలని సూచించారు.