
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
ములుగు రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సీపీఐ జిల్లా సమితి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. మొక్కజొన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులైన బొగ్గుల వాగు, మెడికుంట వాగు, గుండ్ల వాగు సమస్యలను పరిష్కారించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, కార్యవర్గ సభ్యులు ఎండీ అంజాద్పాషా, బండి నర్సయ్య, గడ్డం రామకృష్ణ, బట్టి సంతోష నాసర్, రవి, కుమ్మరి సాగర్ తదితరులు ఉన్నారు.