
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలను అరికట్టి అర్హులకు ఇళ్లు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బీరెల్లిలో బుధవారం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుచరులకు, కార్యకర్తలకే ఇళ్లు కేటాయించి అర్హులైన పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతుందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. మంత్రి సీతక్క సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వివరించారు. మాట ఇచ్చి తప్పడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టి న విద్య అని విమర్శించారు, అర్హులైన నిరుపేదల కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేంత వరకు పోరా టాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ సర్పంచ్ జాజ చంద్రం, మండల ప్రధాన కార్యదర్శి నగేష్, దిడ్డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి