Siddhu Jonnalagadda: డిజె టిల్లు రిలీజ్ ఎప్పుడంటే?
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.
‘‘ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు విమల్ కృష్ణ. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరకర్త.
మరిన్ని వార్తలు