మళ్లీ మర్యాద రామన్న జోడీ

హీరోగా సునీల్ కెరీర్లో మంచి విజయం అందించిన చిత్రం ‘మర్యాద రామన్న’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో సునీల్, సలోని జంటగా నటించారు. ఈ సినిమా 2010లో విడుదలైంది. పదేళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ స్క్రీన్ మీద జంటగా కనిపించబోతోందట. సునీల్, సలోని హీరోహీరోయిన్లుగా దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారట.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి