కల్కిలో మహేశ్‌ బాబు.. నాగ్‌ అశ్విన్‌ ప్లానింగ్‌ అదుర్స్‌! | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి దిగిన మహేశ్‌.. నాగ్‌ అశ్విన్‌ ప్లానింగ్‌ అదుర్స్‌!

Published Wed, May 8 2024 11:57 AM

Mahesh babu Gives Voice Over To Prabhas In Kalki 2898 AD Movie

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. క్రియేటివ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌  పాన్‌ వరల్డ్‌ మూవీ   ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సీనీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్‌ తర్వాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్‌ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్‌ కావడం లేదు.

అలాగే ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు‌ . ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్‌ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్టులో మరో స్టార్‌ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ చిత్రంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా కనిపించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మహేశ్‌ బాబును సంప్రదించారట. అయితే ఇందులో మహేశ్‌ కేవలం వాయిస్‌ ఓవర్‌ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్‌ని రంగంలోకి దించబోతున్నాడట నాగ్‌ అశ్విన్‌. 

ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్‌ పలువురు స్టార్‌ హీరోల సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. పవన్‌ కల్యాణ్‌  ‘జల్సా’, ఎన్టీఆర్‌ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’సినిమాలకు మహేశ్‌ తన గాత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్‌ కోసం మళ్లీ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

Advertisement
Advertisement