మెగా హీరో రామ్ చరణ్ దంపతులు మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఓ పాప, బాబు పుట్టారని చిరు రివీల్ చేశారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సైతం ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజాగా హీరో రామ్ చరణ్ దంపతులకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభినందనలు తెలిపారు. ట్విన్స్కు జన్మనిచ్చిన ఉపాసనకు కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. హాయ్ చిట్టి కవలలు.. ఈ ప్రపంచంలో మీకు స్వాగతం.. ఇప్పటికే మిమల్ని అందరూ చాలా ప్రేమిస్తున్నారంటూ లావణ్య రాసుకొచ్చింది. క్లీంకార ఇప్పుడు అఫీషియల్గా అక్కగా ప్రమోషన్ పొందిందని లావణ్య త్రిపాఠి ట్లీట్ చేసింది. మీ చిన్న కజిన్ వాయువ్ మీతో కలిసి పెరిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ గతేడాది ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి వాయువ్ అని నామకరణం చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి మాత్రం ఎలాంటి కొత్త సినిమాలైతే ప్రకటించలేదు.
Hi tiny twins 💫💙💖
Welcome to this world, you’re already soo loved!
Big hugs to Kaara, now officially promoted to big sister 🌸
A huge congratulations to @upasanakonidela & @AlwaysRamCharan on this double blessing 🤍✨
Love, cuddles, and lots of fun coming your way from…— Lavanya konidela tripathi (@Itslavanya) February 1, 2026


