‘శాకుంతలం’ పై గుణశేఖర్‌ ఆసక్తికర ట్వీట్‌

Gunasekhar Interesting Tweet On Sakunthalam Movie - Sakshi

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గొప్పతనం తెలియజేస్తూ తాజాగా గుణశేఖర్‌ ఓ ట్వీట్‌ చేశారు.  ఇందులో శకుంతలా నాటకం ఎంత గొప్పదో తెలుపుతూ.. తను ఈ సినిమా రూపొందించడానికి కారణం ఏమిటో తెలిపే ప్రయత్నం చేశారు.

''కావ్యేషు నాటకమ్‌ రమ్యమ్‌
నాటకేషు శకుంతలా!
తత్రాపి చ చతుర్థోంకః
తత్ర శ్లోకచతుష్టయం!!

కావ్య ప్రక్రియలన్నిటిలో నాటక ప్రక్రియ రమ్యమైనది. 
నాటకాలన్నింటిలో శకుంతలా నాటకము రమ్యమైనది. 
ఆ శకుంతలా నాటకములో నాలుగవ అంకము, 
అందులోనూ నాలుగు శ్లోకాలు అత్యంత రమ్యమైనవి.. అని  గుణశేఖర్‌ తన ట్వీట్‌ చేశాడు. 

ఇక శాంకుంతలం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయిక ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. గుణశేఖర్ రుద్రమదేవిలో నటించిన అనుష్క ఈ సినిమాలో కూడా నటించనున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఈ తర్వాత పూజా హెగ్దే పేరు కూడా వినిపించింది. అయితే తాము పూజాను  అనుకోలేదని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. అయితే.. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ని అనుకుంటున్నారని తెలిసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top