అఘాయిత్యాలకు మహిళలే కారణం: దర్శకుడు కామెంట్స్‌

Director Perarasu Comments On Women In a Movie Event In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మహిళలే కారణమని దర్శకుడు పేరరుసు పేర్కొన్నారు. రెయిన్‌బో ప్రొడక్షన్స్‌ పతాకంపై వరదరాజ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెన్‌ విలై వెరుమ్‌ 999 రూపాయ్‌ మట్టుమే’. నటుడు రాజ్‌కమల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది.

దీని యాక్షన్‌ రియాక్షన్‌ సంస్థ అధినేత జెనీష్‌ విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఇది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ రూపొందించిన చిత్రం అని చెప్పారన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top