పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఎల్పీఓ యాదయ్య, ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులతో కలిసి సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఉచిత పుస్తకాలను అందిస్తారని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని 6 వార్డు అంగన్వాడీ కేంద్రంలో గురువారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వార్డు కౌన్సిలర్ హరిత, అంగన్వాడీ టీచర్ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని ఆకాంక్షించారు.
శివ్వంపేట(నర్సాపూర్): తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఎంఈఓ బుచ్చనాయక్ కోరారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిమ్మాపూర్ పాఠశాలలో బడిబాట, సమూహిక అక్షరాభ్యాసం, వన మహోత్సవం నిర్వహించారు. విద్యార్థులు కావాల్సిన సదుపాయాలు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు.


