
పీఈసెట్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
ఆదిలాబాద్: ఫిజికల్ ఎ డ్యుకేషన్ కామన్ ఎంట్ర న్స్ టెస్టు (పీఈ సెట్) ఫలితాల్లో ఉమ్మ డి జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరి చారు. ఆది లాబాద్ జి ల్లా గుడిహత్నూర్ మండలం కొల్హరి గ్రామానికి చెందిన పెందూర్ సక్కు రాష్ట్ర స్థాయిలో 22వ ర్యాంకు, నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బ్ర హ్మగావ్ గ్రామానికి చెందిన దేవుగొండ తరంగిణి 87వ ర్యాంకు, కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ గ్రామానికి చెందిన నూనావత్ రాణి 101 ర్యాంకులతో సత్తా చాటారు. వీరంతా ఆది లాబాద్ జిల్లా కేంద్రంలోని వీజీఎస్ డిఫెన్స్ అ కాడమీలో శిక్షణ పొందారు.
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
ఉట్నూర్రూరల్: ఈ నెల 12న పిడుగుపాటుతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాదిగూడ మండలం పిప్రి గ్రామానికి చెందిన రంభాబాయి, పెందూర్ సంజన, మంగం భీంబాయి, పెందూర్ మాధవ్రావు, బేల మండలంలోని కోవ సునీత, నందిని కుటుంబ సభ్యులకు రూ.25 వేల చొప్పున మంజూరైనట్లు పీవో పేర్కొన్నారు.

పీఈసెట్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

పీఈసెట్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ