
ప్రమాదాల నివారణకు చర్యలు
బాసర: బాసర గోదావరి వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి తెలిపారు. ఇటీవల గోదావరి వద్ద ఐదుగురు యువకులు మృతి చెందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి పుష్కర ఘాట్ నుంచి రెండో పుష్కర ఘాట్ వరకు మెట్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి క్లోరినేషన్ చేయించారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు నది లోపలికి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులను, నీటిలో ఇరువైపులా జాలీలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఆర్డీవో సమావేశమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో అశోక్ కుమార్, ఎస్సై శ్రీనివాస్, ఆలయ కార్య నిర్వహణ అధికారి సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.