
మండల కార్యాలయానికి ఎన్నికల సామగ్రి
భీమారం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేరింది. మండలంలో 11గ్రామ పంచాయతీలు, 94వార్డులు, 5ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్స్తోపాటు నామినేషన్ పత్రాలు, కవర్లను ఎన్నికల సంఘం తరలించింది. మండల పరిషత్ కార్యాలయంలోని వివిధ గదుల్లో భద్రపర్చారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉన్నామని ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు.