
మంచిర్యాలలో ప్రైవేట్ కాలేజీ మూత..!
● విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం ● సర్టిఫికేట్ల కోసం కళాశాల చుట్టూ ప్రదక్షిణ ● నోటీసులు జారీ చేసిన డీఐఈవో
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలకు తాళం పడింది. 2025–26విద్యాసంవత్సరం ప్రారంభమైనా తెరవకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు సెకండియర్ చదు వు కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక.. సెకండియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాల చుట్టూ తిరుగుతున్నారు. నిర్వాహకులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. సర్టిఫికేట్లు ఇప్పించాలని వి ద్యార్థులు డీఐఈవోకు మొరపెట్టుకోగా.. యాజమాన్యంపై చర్యల్లో భాగంగా మంగళవారం కళాశాల ఎదుట గోడకు డీఐఈవో అంజయ్య నోటీసులు అతికించారు. సెకండియర్ విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ ఉన్నత చదువులకు వెళ్లాలంటే టీసీ, మెమో తప్పనిసరి. కౌన్సెలింగ్కు వెళ్లడానికి సర్టిఫికేట్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నా రు. కళాశాల మూసివేస్తే నిర్వాహకులు డీఐఈవోకు సమాచారం ఇవ్వడంతోపాటు విద్యార్థుల టీసీలు, మెమోలు, ఇతర సర్టిఫికేట్లు అందించాల్సి ఉంటుంది. కళాశాల తెరవకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల మూసి వేయలేదని, సర్టిఫికేట్లు, ఇతరత్రా పుస్తకాలు తమ పరిధిలోనే ఉ న్నాయంటూ నిర్వాహకులు ఇంటర్మీడియెట్ అధికా రులకు చెప్పినట్లు తెలుస్తోంది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నా రు. ఈ విషయమై డీఐఈవో అంజయ్య స్పంది స్తూ.. ప్రతిభా జూనియర్ కాలేజీ తెరవడం లేదని త మ దృష్టికి వచ్చిందని, మొబైల్ఫోన్లోనూ అందుబాటులో లేరని తెలిపారు. సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు తమ కార్యాలయాన్ని సంప్రదించగా.. మూ డు రోజుల పనిదినాల్లో కళాశాల తెరిచి విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వాలని కళాశాల గోడకు నోటీసులు అతికించినట్లు తెలిపారు.