
ఆటో స్టాండ్ స్థలం కోసం ధర్నా
బెల్లంపల్లిలోని ఆటో యూనియన్ స్థలాన్ని ఇతరులకు కేటాయించొద్దని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ ఆదీనంలోని జీఎం కార్యాలయం పక్కన, మార్కెట్ ఏరియా స్థలంలో 25ఏళ్లుగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థకు కేటాయిస్తూ బెల్లంపల్లి ఆర్డీవో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆటోలు నిలిపేందుకు స్థలం ఇప్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ, వివిధ గ్రామాల ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.