పెండింగ్‌ అర్జీల వివరాలు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ అర్జీల వివరాలు ఇవ్వండి

Jun 17 2025 4:56 AM | Updated on Jun 17 2025 4:56 AM

పెండింగ్‌ అర్జీల వివరాలు ఇవ్వండి

పెండింగ్‌ అర్జీల వివరాలు ఇవ్వండి

సారూ.. కొడుకు బువ్వ పెడుతలేడు

‘‘నా కొడుకు బువ్వ పెడుతలేడు సారు. ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. సాయిబాబ గుడికాడ దాతలు అన్నం పెడుతుంటే అక్కడ కూడా బువ్వ పెట్టొద్దని నా చిన్న కొడుకు బెదిరించిండు.. కరీంనగర్‌లో నా బిడ్డ దగ్గర ఉంటున్న. అల్లుడు చనిపోయిండు. బిడ్డకు కష్టంగానే ఉంది. నేను ఎక్కడ బతుకుడు సారు.. తిండి పెట్టేలా చూడండి సారూ..’’ అంటూ మంచిర్యాలకు చెందిన గడుప బాణమ్మ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను వేడుకుంది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో రోదిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తనకు ఇద్దరు కుమారులు రాజేందర్‌, క్రిష్ణ, కూతురు ఉన్నారని తెలిపింది. భర్త పోషం పదేళ్ల క్రితం చనిపోయాడని, చిన్న కొడుకు చిన్నప్పుడు దత్తత పోయి మళ్లీ తమ దగ్గరికి వచ్చాడని పేర్కొంది. ఉన్న ఆస్తి కొడుకులకు ఇచ్చామని, అన్నదమ్ముల మధ్య గొడవతో పెద్ద కొడుకు హైదరాబాద్‌లో కిరాయికి ఉంటున్నాడని తెలిపింది. చిన్న కొడుకు మంచిర్యాలలో ఉంటున్నా బువ్వ పెట్టకుండా గెంటేశాడని, తల్లివి కావు, దగ్గరికి రావొద్దంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధురాలి కొడుకును పిలిపించి మాట్లాడాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావును కలెక్టర్‌ ఆదేశించారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి, సీఎం ప్రజావాణికి జిల్లా నుంచి అందిన అర్జీల పెండింగ్‌, పరిష్కార వివరాలన్నీ ఎంపీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు మంగళవారం సాయంత్రంలోగా అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని, భూ సమస్యలు పరిష్కరించాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. జన్నారం మండలం పొనకల్‌ గ్రామ శివారులో ఊరచెరువు భూమి కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముల్కల్ల ప్రభాకర్‌ కోరాడు.

విచారణ అధికారిని మార్చండి

మంచిర్యాల జిల్లా టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాలపై విచారణ అధికారిగా జిల్లా సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ జి.హన్మంతరెడ్డిని నియమించారని, ఆయనను మార్చి ఇతర జిల్లాకు చెందిన అధికారిని నియమించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, నాయకులు కలెక్టర్‌ను కోరా రు. ప్రస్తుత విచారణ అధికారి గతంలో టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీ జాయింట్‌ సెక్రెటరీగా పని చేశారని, ఆ సమయంలో 195నంబరు ప్లాంటు పొందా రని, అదే కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి విక్రయించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. వేరే జిల్లా వ్యక్తిని విచారణ అధికారిగా నియమించి ని ష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

ఆలస్యం చేయకుండా పరిష్కరించాలి

అధికారులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement