రైతులకు చేరువలో ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులకు చేరువలో ప్రభుత్వం

Jun 17 2025 4:56 AM | Updated on Jun 17 2025 4:56 AM

రైతులకు చేరువలో ప్రభుత్వం

రైతులకు చేరువలో ప్రభుత్వం

● ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): రైతునేస్తం ద్వారా ప్రభుత్వం రైతులకు మరింత చేరువ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వర్చువల్‌ విధా నం ద్వారా రైతువేదికల్లో రైతునేస్తం–రైతుభరోసా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. హాజీపూర్‌ మండలం ముల్కల్ల రైతువేదికలో కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అధికారులు, రైతులు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ ప్రతీ మంగళవారం రైతువేదికల ద్వా రా రైతుల సమస్యలు తెలుసుకుంటూ సాగుపై సూ చనలు చేసేలా కార్యక్రమాలు ఉంటాయని తెలి పారు. మరో తొమ్మిది రోజుల్లో రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రేషన్‌ కార్డుల జారీ, సన్నరకం బియ్యానికి బోనస్‌ అమలు జరుగుతుందని తెలిపారు. కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ మాట్లాడుతూ సాగులో మెళకువలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సూచనలు అందేలా చూస్తామని తెలిపారు. డీఆర్‌డీఓ కిషన్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావుదేశ్‌పాండే, ఏఓ కృష్ణ, ఏఈఓ మౌనిక, ఆత్మ చైర్మన్‌ మురళి పాల్గొన్నారు.

కిష్టంపేటలో..

తాండూర్‌: మండలంలోని కిష్టంపేట రైతువేదికలో సోమవారం రైతునేస్తం సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా వ్యవసాయ అధికారి కల్పన హాజరయ్యారు. ఏవో సుష్మ, డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సల్వా జి మహేందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement