
‘మోదీ పాలనలో దేశం అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: దేశ ప్రధానిగా 11 ఏళ్ల సుపరిపాలనతో దేశం ఎంతో అభివృద్ధి చెందింద ని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని పైకి తీ సుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అ న్నారు. సోమవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో నరేంద్రమోదీ విజయాలు, అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రా రంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ దేశప్రజల రక్షణతోపాటు అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా పాలన ఉందని కొని యాడారు. మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, పురుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, ఆకుల అశోక్వర్ధన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.