
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తవ్వకాలు
కడెం: మండలంలోని దోస్త్నగర్ సమీపంలో కొండపై వెలసిన శ్రీనల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. దస్తురాబాద్కు చెందిన అర్చకుడు నరేశాచార్యులు సోమవారం భక్తులు, అర్చకులతో కలిసి ఆలయానికి వెళ్లగా పరిసరాల్లో విరగగొట్టిన ద్వార మూర్తి విగ్రహం, అరబిక్ భాషతో కూడిన ఇత్తడి కడ్డీలు, తట్ట, పార కనిపించాయి. పడేసిన విగ్రహాలకు సంప్రోక్షణ, శాంతిపాఠం, నారసింహా పారాయణం జరిపించి పునఃప్రతిష్టించారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు భావించారు.
క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంచిర్యాల పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించారు. రెడ్, గ్రీన్ టీంలకు 50 ఓవర్ల మ్యాచ్ను కోచ్ ప్రదీప్, సీనియర్ క్రికెటర్లు గోదావర్తి, చందు ప్రారంభించారు. గ్రీన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 13.4 ఓవర్లలో 60 పరుగులు చేసి ఆలౌట్ కాగా రెడ్ జట్టు కేవలం 1 వికెట్ను కోల్పోయి 11.1 ఓవర్లలో 61 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తవ్వకాలు