
15 వేలకు చేరిన దరఖాస్తులు
భైంసా: ఆర్జీయూకేటీలో ప్రవేశానికి గత నెల 31 నుంచి టీఎస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు. సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 15,015 దరఖాస్తులు వచ్చినట్లు వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1500 సీట్లను కేటాయించింది. జూన్ 21 వరకు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు.
వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింత
ఆదిలాబాద్టౌన్: బోథ్ మండల కేంద్రానికి చెందిన అంకుష్ గౌరు (90) వృద్ధాప్యంతో ఆదివారం మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు నారాయణ వృత్తిరీత్యా కండక్టర్ కాగా నిర్మల్లో నివాసం ఉంటున్నాడు. తల్లి నిర్మల్లో మృతి చెందడంతో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం మృతదేహాన్ని అప్పగించారు. అవయవదానం, శరీర దానం చేస్తే మెడికోలకు ప్రాక్టీస్తో పాటు పేద ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

15 వేలకు చేరిన దరఖాస్తులు