
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సిర్పూర్(యూ) మండలం పాములవాడకు చెందిన పెందూర్శంకర్ తమ గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయాలని, రెబ్బెన మండలం గోలేటికి చెందిన లక్ష్మి తనకు పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం కమ్మర్గావ్కు చెందిన పృథ్విరాజ్ తనకు గురుకులంలో అడ్మిషన్ ఇప్పించాలని కోరారు. ఇంకా వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, డీడీ అంబాజీరావు, పీహెచ్వో సందీప్, ఏడీఎంఅండ్హెచ్వో మనోహర్, ఏవో దామోదర స్వామి, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.