
టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడిగా బండి రమేశ్
శ్రీరాంపూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడిగా బండి రమేశ్ నియమితులయ్యారు. నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి హాజరై మాట్లాడారు. యూనియన్ బైలాస్ ప్రకారం నూతన ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్మికవర్గ ప్రయోజనాలే లక్ష్యంగా టీబీజీకేఎస్ పని చేస్తుందన్నారు. గు ర్తింపు సంఘంగా సింగరేణి చరిత్రలో నిలి చిపోయేలా హక్కులు సాధించామన్నారు. సింగరేణిలో నేడు రాజకీయ జోక్యం పెరిగిందని త ద్వారా సంస్థ అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ వార్షిక లాభా లను వెంటనే ప్రకటించి అందులో నుంచి కా ర్మికులకు 35 శాతం వాటా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఆ యూనియన్ సెంట్రల్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీని యర్ ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పొగాకు రమేశ్, నాయకులు అన్వేశ్రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి గోగుల రవీందర్రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.