
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా
మంచిర్యాలక్రైం: లోక్ అదాలత్తో సత్వర న్యా యం జరుగుతుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్ పరి ధిలో ఈ నెల 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో 13,048 కేసులు పరిష్కారమయ్యాయని తెలి పారు. 80 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.17,66,264 లక్షలు తిరిగి అందించినట్లు పేర్కొన్నారు. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పెండింగ్లో ఉన్న కేసులు, విపత్తు నిర్వహణ, ఈ–పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ నేరాల కేసుల్లోని కక్షిదారులను పిలింపించామని వివరించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చేలా కృషి చేసిన అధికారులను అభినందించారు.