
ఆలయంలో చోరీ నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని చౌడేశ్వరి మాతా ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. ఆదివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ సమీర్ వారం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలై వచ్చాడు. గంజాయికి బానిసైన ఆయన శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో క్రాంతినగర్కు చెందిన షేక్ అయ్యాన్, మహరాష్ట్రకు చెందిన రాహుల్తో కలిసి చౌడేశ్వరి మాతా ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. వాచ్మెన్ గంగయ్యను కత్తితో బెదిరించి రూ.3వేల నగదు, బీరువాలో ఉన్న ముక్కుపుడకను దొంగిలించి పరారయ్యారు. ఆదివారం వడ్డెర కాలనీలో చోరీకి ప్రయత్నించాడు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి గంజాయి సేవించే పరికరం, రూ.వెయ్యి నగదుతో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.