
‘సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలి’
ఆదిలాబాద్అర్బన్: కార్మిక సమస్యలపై పోరాటా లకు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రీజియన్ మహాసభను సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యా ప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా చర్చించారు. యాజమాన్యం తగ్గి స్తున్న ఓటీల గురించి, కార్మికుల వేధింపులు, డబల్ డ్యూటీపై చర్చించారు. ప్రతి డిపోలో కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నా రు. ఈ సమస్యలు పరిష్కారించాలని, లేనిపక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలన్నారు. అనంతరం ఆదిలాబాద్ రీజియన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్.భీమ్రావ్, కార్యదర్శిగా ఎం.భీమ్రావ్, కోశాధికారిగా నారాయణ, ప్రచార కార్యదర్శిగా ఎం.పొచ్చన్నతో పాటు ఎనిమిది మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.