
చెరువులో నీటమునిగి ఒకరు మృతి
బాసర: ప్రమాదవశాత్తు చెరువులో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన బలగం రాజు (38) మూడు రోజులుగా మైలాపూర్ గ్రామంలోని చెరువులోకి దిగి కమలం పూలు తెచ్చుకుని విక్రయిస్తున్నాడు. ఆదివారం పూలకోసం చెరువులోకి దిగడంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.