
బాసరలో భక్తుల రద్దీ
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
క్యూలో వేచి ఉన్న భక్తులు
చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూలో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. 1000 రూపాయల ప్రత్యేక అక్షరాభ్యాసం 378 టికెట్లు, సాధారణ అక్షరాభ్యాసం 150 రూపాయల టికెట్లు 824, అద్దెగదులు, చండీ హోమం, శ్రీ సత్యనారాయణ పూజ, వాహన పూజ టికెట్ల ద్వారా రూ.12,07,210 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వణాధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. – బాసర

బాసరలో భక్తుల రద్దీ