
లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో డీఐజీ పూజలు
జైనథ్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో డీఐజీ తరుణ్ జోషి ఆదివారం పూజలు చేశారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది శాలువాతో సత్కరించారు. స్వామి వారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అ డ్డి రాకేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అ శోక్ రెడ్డి, నాయకులు జగదీశ్రెడ్డి, బద్దం సురేష్ రె డ్డి, రాజన్న, వెంకటి, బండి పోచన్న, పాల్గొన్నారు.
జాతీయ సమావేశాలకు తపస్ నేతలు
మంచిర్యాలటౌన్: సిమ్లాలో జరుగుతున్న అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్విక్ మహాసంఘ్ జాతీయ కా ర్యకారిణి సమావేశాలకు మంచిర్యాలకు చెందిన తె లంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నా యకులు హాజరయ్యారు. జిల్లా నుంచి బండి రమేశ్, తెల్కలపల్లి పెంటయ్య హాజరై విద్యారంగా నికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని కోరారు.

లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో డీఐజీ పూజలు