
‘ఇన్చార్జి మంత్రిగా సీతక్కను కొనసాగించాలి’
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ ముద్దుబిడ్డ, రాష్ట్ర మంత్రి సీతక్కను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. ఆదివారం మావల మండలంలోని కుమురం భీం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీల ఆశాజ్యోతి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారన్నారు. ప్రజల మన్ననలు పొందారన్నారు. ముఖ్యంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు ఆదివాసీ చట్టాలు, హక్కులు, సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మంత్రిని మార్చడం ఆదివాసీలను అవమానపర్చడమే అవుతుందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సీఎం సైతం దత్తత తీసుకున్నారన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుకా, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరా, డివిజన్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఆత్రం గణపతి, నాయకులు వెడ్మ ముకుంద్రావు, తొడసం ప్రకాశ్, గోవింద్రావు, గేడం గణేశ్, గేడం శ్యాంరావు, మనోహర్, దశరథ్, వెట్టి బాలు, సిడాం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.